తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart: సంజయ్ దత్‍కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే!

Double iSmart: సంజయ్ దత్‍కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే!

02 August 2023, 22:39 IST

    • Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..
డబుల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ లుక్
డబుల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ లుక్

డబుల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ లుక్

Double iSmart: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రూపొందుతోంది. 2019లో సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రానుంది. దీంతో ఈ ‘డబుల్ ఇస్మార్ట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‍లో ప్లాన్ చేశాడు పూరి. అందుకే బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్‍ను ఈ సినిమా కోసం తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

Blackout OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న 12th ఫెయిల్ హీరో కొత్త సినిమా: డేట్ ఖరారు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

TV Serial : తెలుగులో వస్తున్న శ్రీమద్ రామాయణం సీరియల్: ప్రారంభ తేదీ, టైమింగ్స్ ఇవే: కాంటెస్ట్ కూడా..

Allu Arjun at Dhaba: దాబాలో భార్యతో కలిసి అల్లు అర్జున్ లంచ్.. ఫొటోలు వైరల్.. ఎక్కడో తెలుసా?

డబుల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నాడని పూరి జగన్నాథ్ ఇటీవలే ప్రకటించాడు. సంజయ్ దత్ పుట్టిన రోజైన జూలై 29న ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆయనకు స్వాగతం పలికాడు. 'బిగ్ బుల్' క్యారెక్టర్‌లో సంజయ్ దత్ నటిస్తున్నాడంటూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍ ఏకంగా రూ.15కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ కోసం సంజయ్ దత్ 60 రోజులను కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ 60 రోజుల డేట్స్ కోసం రూ.15కోట్లను అతడు అందుకోనున్నాడని సమాచారం. కాగా, డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే ముంబైలో పూర్తయింది. తదుపరి షెడ్యూల్ షూటింగ్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మూవీ యూనిట్. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

లైగర్ సినిమాతో గతేడాది భారీగా నష్టపోయాడు డైరెక్టర్,నిర్మాత పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ చిత్రం ఘోరంగా విఫలమైంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ మూవీ పూరీకి చాలా ముఖ్యం. మరోవైపు, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మూడేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్‍ కూడా ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం