తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: న్యూయార్క్‌లో అల్లు అర్జున్ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

Allu Arjun: న్యూయార్క్‌లో అల్లు అర్జున్ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

19 August 2022, 17:11 IST

    • అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహా రెడ్డి అమెరికా న్యూయార్క్‌లో ఉన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో జరగనున్న పేరెడ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్-స్నేహా రెడ్డి
అల్లు అర్జున్-స్నేహా రెడ్డి (Twitter)

అల్లు అర్జున్-స్నేహా రెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కాలంలో కుటుంబంతో కలిసి వెకేషన్‌కు తెగ వెళ్తున్నాడు. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నాడు మన స్టైలిష్ స్టార్. తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహాతో కలిసి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో వీరిద్దరూ కలిసున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా తాను యూఎస్ఏలో ఉన్నట్లు అల్లు అర్జున్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఆగస్టు 19 శుక్రవారం నాడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు అమెరికా న్యూయార్క్ ఎయిర్ పోర్టులో కనిపించారు. యానువల్ ఇండియా డే పేరెడ్ కోసం వీరు ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరుక ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫొటోలను షేర్ చేశారు. ఇండియన్ అసోసేషియన్ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ సంస్థ భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ దంపతులు కూడా వీరితో కలిసి సైనికల బలగాలతో చేరిపోయారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ విషయంపై విశేషంగా స్పందిస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా యానువల్ ఇండియన్ డే పేరెడ్ నిర్వహించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొననున్నారు.

పని విషయానికొస్తే అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప ది రైజ్ చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. త్వరలోనే పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది కాకుండా వేణు శ్రీరామ్, బోయపాటి శ్రీను, ఏఆర్ మురుగదాస్ లాంటి దర్శకులతో సినిమాలకు పచ్చజెండా ఊపారు మన స్టైలిష్ స్టార్.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం