తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Assets Case : అక్రమాస్తుల కేసులో విచారణపై పిల్, సీఎం జగన్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు

CM Jagan Assets Case : అక్రమాస్తుల కేసులో విచారణపై పిల్, సీఎం జగన్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు

08 November 2023, 13:38 IST

    • CM Jagan Assets Case : సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం చేయాలని కోరుతూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... సీఎం జగన్ , సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది.
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు

CM Jagan Assets Case : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగవంతం చేసేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని పిల్ గా పరిగణించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దీనిని పిల్ గా అంగీకరించింది. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ వ్యాజ్యానికి నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2024లో జరిగి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు

సీఎం జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐను ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌ఎన్‌వీ భట్టిలతో కూడిన ధర్మాసనం....ఈ కేసులో విచారణను దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది. విచారణను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బయటకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సీఎం జగన్, సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎంపీ రఘురామ పిటిషన్

దాదాపు పదేళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసు పెండింగ్‌లో ఉందని, ఇంకా అభియోగాలు కూడా నమోదు చేయలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం సీఎం జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపిస్తూ విచారణను బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ సవాలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. క్విడ్-ప్రో-కో డీల్స్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ పై 11 కేసుల్లో అభియోగాలు ఉన్నాయి.

ఏపీ హైకోర్టులో మరో కేసు

సీఎం వైఎస్ జగన్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తూ... ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు జడ్జి జస్టిస్ రఘునందన్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను రిజిస్ట్రీ మరో జడ్జికి అప్పగించనున్నారు. సీఎం జగన్ తన నిర్ణయాలతో ఆయన బంధువులు, వివిధ కంపెనీలకు కోట్ల రూపాయల లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నిర్ణయాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు జస్టిస్ రఘునందనరావు ముందు అంగీకరించినా, చివరికి విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం