Ponguleti In vijayawada: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి
11 December 2023, 11:43 IST
- Ponguleti In vijayawada: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగులేటితో పాటు పలువురు వైసీపీ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇంద్రకీలాద్రిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti In vijayawada: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయవాడ దుర్గమ్మను దర్శించకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన పొంగులేటికి దుర్గగుడి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ట్రెండింగ్ వార్తలు
పొంగులేటిని ఇంద్రకీలాద్రిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.
ఆలయ మర్యాదలతో పొంగులేటికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత పొంగులేటికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందచేశారు. అమ్మవారి దర్శనం తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.