Extra Marital Affair: ప్రియుడితో కలిసి కన్నబిడ్డను హత్య చేసి పూడ్చిపెట్టిన తల్లి
31 December 2022, 8:26 IST
- Mother Killed And Buried Her Child With Boyfriend: కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలుడి మిస్సింగ్ కేసుపై పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధమే బాలుడి ప్రాణం తీయగా.. తల్లి, ప్రియుడే చంపేశారని తెలుస్తోంది.
బద్వేలులో దారుణం
Mother Killed her Child in Kadapa District:ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త లారీ డ్రైవర్. సీన్ కట్ చేస్తే భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ టైం చేసుకుని అతనితో పాటు పిల్లలను తీసుకెళ్లి ఇంట్లో నుంచి పారిపోయింది. భార్య సమాచారం తెలుసుకున్న భర్త... ఆమె ఉంటున్న నివాసానికి వెళ్లాడు. అక్కడ కుమారుడు కనిపించలేదు. భార్య పొంతన లేని సమాధానాలు చెప్పుకోచ్చింది. వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. ఏకంగా కుమారుడిని ప్రియుడితో కలిసి తల్లి చంపినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన కడప జిల్లా బద్వేల్ లో వెలుగు చూసింది.
కళ్యాణదుర్గంకు చెందిన మారుతినాయక్ లారీడ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇతను బెంగుళూరుకు చెందిన కవితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. లారీడ్రైవర్గా పనిచేసే మారుతినాయక్కు అదే వృత్తిలో ఉండే వినోద్ అనే యువకుడు పరిచమం అయ్యాడు. క్రమంగా మారుతినాయక్ ఇంటికి వస్తూపోతూ ఉండే సమయంలో వినోద్ తో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల కిందట వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. వీరు బద్వేలులోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి సమాచారం తెలుసుకున్నాడు భర్త మారుతినాయక్. తన సోదరితో వచ్చి కవితను ప్రశ్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్ పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది, కుమారుడు(4) ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది భార్య. వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు విచారణ జరిపారు.
విచారణలో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. రాత్రివేళల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తుండటంతో వినోద్ తీవ్రంగా కొట్టడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అధికారికంగా బాలుడి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.