తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aphc Ys Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

Sarath chandra.B HT Telugu

10 May 2024, 14:06 IST

    • APHC YS Sunitha: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందులలో నమోదైన  కేసులు కొట్టేయాలని దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. 
సునీత, వైఎస్ వివేకా
సునీత, వైఎస్ వివేకా

సునీత, వైఎస్ వివేకా

APHC YS Sunitha: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో పిఏ కృష్ణారెడ్డిని బెదిరించారనే ఆరోపణలపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వైఎస్‌ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతంలో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఒత్తిడి చేశారంటూ, ఈ క్రమంలో తనను వేధించారని గతంలో పోలీసులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.

కృష్ణారెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వాటిని కొట్టేసింది.

మరోవైపు వివేక హత్యపై నా పోరాటం వ్యక్తిగతమే కాదని సునీత అన్నారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కూడా తాను పోరాడుతున్నానని చెప్పారు. వివేకా హత్య కేసు వ్యక్తిగతం అయితే కిరాయి రౌడీలతో ప్రత్యర్థులను లేపేసేదాన్నని అన్నారు.

స్థానిక పోలీసుల విచారణ ఆధారంగానే సీబీఐ కూడా దర్యాప్తు కొనసాగించిందని, సీబీఐ దర్యాప్తును జగన్ అడ్డుకుంటాడని కారణంతోనే సుప్రీంకోర్టు కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిందన్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకు నన్ను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు, సీఎం రమేష్ పేర్లను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.

వివేకాను జగన్ ఓ మనిషిలా కూడా గుర్తించలేదని, జగన్ వెంట నడిచిన వివేకాను అవినాష్ చంపిస్తే న్యాయం ఎందుకు చేయడం లేదని వైఎస్ సునీత ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం