తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కాసేపట్లో పెళ్లి...వరుడి మృతి ... మరొకరితో యువతికి పెళ్లి

కాసేపట్లో పెళ్లి...వరుడి మృతి ... మరొకరితో యువతికి పెళ్లి

HT Telugu Desk HT Telugu

23 May 2022, 12:07 IST

    • కొద్దిసేపట్లో పెళ్లి కావాల్సిన యువకుడు పీటల మీదకు ఎక్కకుండానే విగతజీవిగా మారాడు. నిర్ణయించిన సమయానికే మరొకరితో యువతికి పెళ్లి జరిపించన ఘటన ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కర్నూలు జిల్లా గ్రామంలో జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు. గ్రామంలోనే ఎలక్ట్రిషియన్‌ గా పని చేస్తున్నాడు. అబ్దుల్‌ హమీద్‌కు హోళగుంద మండలం గజ్జహల్లి గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. మే 22 ఆదివారం ఇద్దరికి నిఖా జరగాల్సి ఉంది. 

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

పెళ్లి కూతురు ఇంట్లో వివాహ కార్యక్రమం ఉండటంతో పెళ్ళికొడుకు, వారి బంధువులు శనివారం రాత్రి గజ్జహల్లి చేరుకున్నారు. శనివారం రాత్రి వివాహానికి ముందు నిర్వహించే వేడుక నిర్వహిస్తుండగా కడుపులో నొప్పిగా ఉందని విలవిలలాడటంతో సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సిరిగుప్ప ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన కాసేపటికే హమీద్ మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి జరగాల్సిన గంట ముందే మృత్యువాత పడటంతో ఇరుకుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

ఆస్పత్రి నుంచి కోలుకుని తిరిగి వస్తాడనుకున్న హమీద్ మరణించడంతో సమీప బంధువుతో అప్పటికప్పుడు పెళ్లి నిర్ణయించి వివాహం జరిపించారు. పెళ్లి కొడుకు మరణించడంతో వధువు తల్లిదండ్రులు తమ సమీప బంధువులైన హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన మరో యువకుడితో అదే రోజు వివాహం జరిపించారు. దురదృష్టవశాత్తూ పెళ్ళికొడుకు మరణించడంతో నిర్ణయించిన సమయానికి నబి రసూల్ అనే యువకుడితో పెళ్లి చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం