తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Son Killed Mother: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. తల్లిని హత్య చేసిన తనయుడు

Son Killed Mother: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. తల్లిని హత్య చేసిన తనయుడు

HT Telugu Desk HT Telugu

03 May 2023, 6:44 IST

    • Son Killed Mother: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులివ్వలేదని కన్నతల్లిని హతమార్చాడో వ్యక్తి.  పదిహేనేళ్ల క్రితం తండ్రిని చంపి జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోని నిందితుడు తాజాగా తల్లిని కూడా చంపేశాడు. 
ఎన్టీఆర్ జిల్లాలో తల్లిని హత్య చేసిన కుమారుడు
ఎన్టీఆర్ జిల్లాలో తల్లిని హత్య చేసిన కుమారుడు

ఎన్టీఆర్ జిల్లాలో తల్లిని హత్య చేసిన కుమారుడు

Son Killed Mother: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో కన్నతల్లిని కొట్టి చంపేశాడు. పదిహేనేళ్ల క్రితం తండ్రిని కూడా డబ్బుల కోసం కొట్టి చంపిన నిందితుడు, ఆ కేసు నుంచి బయటకు వచ్చాక తీరు మార్చుకోక తల్లిని కూడా పొట్టన పెట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ శివారు చెన్నవరం గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదనే సాకుతో తల్లిని దారుణంగా హత్య చేశాడు. 17 ఏళ్ల క్రితం 2006 లో మద్యం సేవించడానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రిని కర్కశంగా కొట్టి చంపాడు. ఆ కేసులో నాలుగేళ్ళు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. అయినా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. నిందితుడి విపరీత ప్రవర్తనతో కట్టుకున్న పెళ్ళాం వదిలేసింది. అంతా వదిలేసినా కన్నతల్లి ఇంట్లోనే పెట్టుకుని కాలం నెట్టుకొచ్చింది. చివరకు అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది.

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ శివారు చెన్నవరం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కొడుకు విచక్షణ రహితంగా తల్లి తండ్రులను చంపి పొట్టన పెట్టుకున్నాడు. కనిపెంచిన తల్లి తండ్రులనే హతమార్చి హంతకుడయ్యాడు. డబ్బు కోసం తల్లిని అతి దారుణంగా హతమార్చటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

గ్రామానికి చెందిన 70 ఏళ్ళ వయసున్న మరీదు వెంకమ్మకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెక్కలు కష్టంతో పిల్లల్ని పెద్ద చేసింది. కూతుళ్లకు పెళ్ళై అత్తారిళ్లకు వెళ్ళారు. కొడుకు మరీదు వెంకటేశ్వర్లు పెళ్ళై పిల్లలున్నా తల్లి తండ్రుల పాలిట కాలయముడిగా మారాడు. వెంకటేశ్వర్లు వ్యవహార శైలితో విసుగుచెందిన భార్య అతడిని వదిలేసి వెళ్ళిపోయింది.

మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు మందు కోసం ఎంతకైనా తెగిస్తాడని గ్రామస్తులు చెబుతున్నారు. తాగి రోడ్లపై పడిపోవటం ఇంటికొచ్చి తల్లిపై చిందులెయ్యటం అలవాటు చేసుకున్నాడు. 17 ఏళ్ల క్రితం 2006లో మద్యానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రిని కర్కశంగా కొట్టి చంపేశాడు. ఈ కేసులో నాలుగేళ్ళు జైల్లో ఉండి వచ్చాడు. అయినా ఎలాంటి మార్పు రాలేదు.

వెంకటేశ్వర్లును భార్య వదిలేయడంతో ఏడు పదుల వయసులో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో కాలం నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో మే ఒకొటో తేదీన పెన్షన్ డబ్బులు వస్తాయి అని ఇంటికొచ్చిన కొడుకు తల్లితో డబ్బులు కావాలని గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో రాత్రి పదిన్నర సమయంలో కర్రతో కిరాతకంగా కొట్టి చంపేశాడు. తెల్లారిన తర్వాత విషయం వెలుగు చూసింది. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం