తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1, 2 Notifications : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

AP Group 1, 2 Notifications : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

31 May 2023, 16:37 IST

    • AP Group 1, 2 Notifications : ఏపీలో త్వరలో గ్రూప్ -1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ సవాంగ్ తెలిపారు. పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

AP Group 1, 2 Notifications : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-1, గ్రూప్- 2 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. నోటిఫికేషన్ల జారీకి ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1000 పోస్టులకు పైగా భర్తీ చేసేందుకు గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం పోస్టుల భర్తీపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందించారు. త్వరలో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

జూన్ 3 నుంచి మెయిన్స్ పరీక్షలు

త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు APPSC ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్‌ వెల్లడించారు. జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ నిర్వహించామన్నారు. పరీక్షలు నిర్వహించిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామన్నారు. ప్రిలిమ్స్ లో 6,455 మంది మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారని సవాంగ్ తెలిపారు. జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్ -1 మెయిన్స్‌ పరీక్షలను 10 జిల్లాల్లో 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఆగస్టులో ఇంటర్వ్యూలు

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని గౌతమ్ సవాంగ్ తెలిపారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే అభ్యర్థులకు గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుందన్నారు. ఆ సమయం దాటితే మాత్రం అభ్యర్థులను లోపలికి అనుమతించబోమన్నారు. జులైలో గ్రూప్ 1 మెయిన్స్‌ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఆగస్టు చివరి నాటికి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

1000 పైగా పోస్టులు

ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు వివరించారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు ఖాళీ ఉండగా, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కి పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ద్వారా మొత్తంగా 1000కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌ -2 పరీక్షలకు సంబంధించి వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలన్నారు.

తదుపరి వ్యాసం