భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. బుధవారం ఉదయం 7 గంటల తర్వాత ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి బయటకు పరుగులు తీశారు.
ఇక ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అయింది. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించిందని హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. ఇక భారత్ లో చూస్తే నాలుగు సిస్మోక్ జోన్లు(జోన్ II, జోన్III, జోన్IV, జోన్V.) ఉంటాయి. ఇందులో తెలంగాణలో జోన్ 2లో ఉంది. ఈ జోన్ లో ఉండే ప్రాంతాలకు అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంటుంది.
"తెలంగాణలో తేలికపాటి భూ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ భూకంపాలకు గురయ్యే ప్రాంతం కాదు. భూ ప్రకంపనలు తీవ్రస్థాయిలో లేవు" అని CSIR-NGRI డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ చెప్పారు.
సంబంధిత కథనం