IAS Transfers in Telangana : తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్రాజ్ బదిలీ కాగా….వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. 12 రోజుల పాటు అమెరికాలోనే ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ టూర్ ను నిర్ణయించారు. సీఎంతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు కూడా టూర్ లో ఉన్నారు.
న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో, దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఎనిమిదిరోజులు అమెరికాలో పర్యటిస్తారు. ఆ తర్వాత మరో రెండు రోజులు దక్షిణ కొరియాలో ఉంటారు. ఆగస్టు 14న సీఎం రేవంత్ రెడ్డి టీమ్ హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ టూర్ లో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ టీమ్ భేటీ అవుతుంది. రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలకి వసతులతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేస్తారు.
మరోవైపు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి వివరించారు. స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన "ఆటోమోటివ్ డిపార్ట్మెంట్"ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర… ముఖ్యమంత్రిని కోరారు.