(1 / 4)
భద్రాద్రి పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతికి ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు
(2 / 4)
ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘ప్రసాద’ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు.
(3 / 4)
భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.
(4 / 4)
సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనం కార్యక్రమాన్ని భద్రాచలంలో నిర్వహించారు. అంతకుముందు ఏకలవ్య ఆదర్శ పాఠశాలను రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు.
ఇతర గ్యాలరీలు