హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో పచ్చదనం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్కు ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్ అవార్డు ఇచ్చారు. శ తాజ్ దక్కన్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన ఈ అవార్డు ప్రదానోత్సవానికి రాలేకపోయారు.
ఆయన తరఫున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ ఈ అవార్డు స్వీకరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఈ అవార్డు అందజేశారు. ప్రతిష్టాత్మక ఐఎఫ్ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) ఈ అవార్డు అందిస్తుంది. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై సంతోష్కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని పంపించారు.
టాపిక్