Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్, చివరికి?-hyderabad news in telugu hoax bomb call to shamshabad rgi airport ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్, చివరికి?

Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్, చివరికి?

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2024 10:33 PM IST

Hyderabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఎయిర్ పోర్టు సిబ్బంది తనిఖీలు చేసి అది ఫేక్ కాల్ గా నిర్థారించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు
శంషాబాద్ ఎయిర్ పోర్టు

Hyderabad Airport : హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శనివారం ఓ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. విమానాశ్రయ సిబ్బంది ఈ కాల్ పై పోలీసులు సమాచారం అందించారు. ఈ నంబర్ ట్రేస్ చేసి పోలీసులు... కాచిగూడకు చెందిన వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.

అసలేం జరిగింది?

గుర్తు తెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఆదివారం బాంబులు పేల్చడానికి ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు శనివారం రాత్రి ఓ నంబర్‌కు ఫోన్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు బాంబులు పేల్చడానికి ఎయిర్ పోర్టుకు వస్తున్నారని, రెండు బ్యాగ్‌లతో ఉన్నారని, ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేయాలని చెప్పాడు. ఈ విషయంపై ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్ కాచిగూడకు చెందిన ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ టీ స్టాల్ లో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, పక్కనున్న వ్యక్తి వారి మాటలు విని ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు విమానాశ్రయ ఎంట్రన్స్ వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసుల తనిఖీల తర్వాత ఈ కాల్ ఫేక్ అని ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం భారీగా హెరాయిన్ పట్టుబడింది. సౌత్ ఆఫ్రికాలోని జాంబియా నుంచి శంషాబాద్ కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి సుమారు రూ. 41 కోట్ల విలువైన 5.92 కిలోల హెరాయిన్‌ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జాంబియా నుంచి హైదరాబాద్ వచ్చిన లుసాకా అనే మహిళపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ తో పాటు లగేజీని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డాక్యుమెంట్‌ ఫోల్డర్‌లో దాచి ఉంచిన 5.92 కిలోల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడిన మహిళపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తరచూ బంగారం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న విదేశీయులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు.

IPL_Entry_Point