World Cup Qualifiers : పసికూన జట్టుపై విరుచుకుపడ్డ హసరంగా.. 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసేశాడు-world cup qualifiers match 4 oman win against ireland by 5 wickets details inside ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup Qualifiers : పసికూన జట్టుపై విరుచుకుపడ్డ హసరంగా.. 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసేశాడు

World Cup Qualifiers : పసికూన జట్టుపై విరుచుకుపడ్డ హసరంగా.. 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసేశాడు

Anand Sai HT Telugu
Jun 20, 2023 02:07 PM IST

World Cup Qualifiers : వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం ఐర్లాండ్ కు ఒమన్ షాక్ ఇచ్చింది. మరోవైపు శ్రీలంక బోణీ కొట్టింది. హసరంగా 24 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు.

హసరంగా
హసరంగా (twitter)

ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో శ్రీలంక తన తొలి మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 355/6 పరుగులు చేసింది. ఈ టోర్నీని ఛేదించేందుకు దిగిన యూఏఈ జట్టు వనిందు హసరంగా బౌలింగ్‌ ధాటికి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక 175 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. ఫతుమ్ నిశాంక, కరుణరత్నే తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్‌లో నలుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఫాతుమ్ నిశాంక 57 పరుగులు చేయగా, కరుణరత్నే 52 పరుగులు చేశాడు. కుశాల్ మెండిస్ 78 పరుగులు, సమరవిక్రమ 73 పరుగులు చేశారు. అసలంక కూడా 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. చివరికి 12 బంతుల్లో 23 పరుగులు చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 355 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ స్కోరును ఛేదించేందుకు యూఏఈ జట్టు పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. కెప్టెన్ మహ్మద్ వసీం, వృత్య అరవింద్ చెరో 39 పరుగులు చేయడం అత్యధిక స్కోరు. స్పిన్నర్ హసరంగా ధాటికి యుఎఇ కేవలం 39 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. భారీ తేడాతో లొంగిపోయింది. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హసరంగ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. హసరంగ కేవలం 3 సగటుతో పరుగులు ఇచ్చాడు. మిగిలిన వారిలో లహిరు కుమార్, మహిష థిక్షన్ మరియు ధనంజయ డిసిల్వా ఒక్కో వికెట్ తీశారు.

ఇక ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 4వ మ్యాచ్‌లో ఐర్లాండ్‌, ఒమన్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. ఐదు వికెట్ల తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించడంలో ఒమన్ సఫలమైంది. దీంతో ఒమన్ శుభారంభం చేసినట్టైంది.

ఈ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. మిడిలార్డర్ ఆటగాళ్లు హ్యారీ టెక్టర్, డాక్రెల్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి ఒమన్ జట్టుకు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐర్లాండ్‌ జట్టు నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఒమన్‌ తొలి వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయినప్పటికీ, మిగతా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. కశ్యప్ ప్రజాపతి 72 పరుగులు చేయగా, అకిబ్ ఇలియాస్ 52 పరుగులు, కెప్టెన్ జీషన్ మక్సూద్ 59 పరుగులు, మహ్మద్ నదీమ్ 46 పరుగులు చేశారు. తద్వారా 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 11 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఐర్లాండ్ ప్లేయింగ్ స్క్వాడ్ : పాల్ స్టిర్లింగ్, ఆండీ మెక్‌బ్రియన్, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, గ్రాహం హ్యూమ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

ఒమన్ ప్లేయింగ్ స్క్వాడ్ : కశ్యప్ ప్రజాపతి, జతీందర్ సింగ్, షోయబ్ ఖాన్, జీషన్ మక్సూద్ (కెప్టెన్), మహ్మద్ నదీమ్, అయాన్ ఖాన్, నసీమ్ ఖుషీ (వికెట్ కీపర్), బిలాల్ ఖాన్, జే ఒడెద్రా, ఫయాజ్ బట్, అకిబ్ ఇలియాస్.

WhatsApp channel