Asian Games Badminton: చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్.. స్వర్ణం కైవసం-chirag shetty satwiksairaj rankireddy creates history with gold in asian games ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Chirag Shetty Satwiksairaj Rankireddy Creates History With Gold In Asian Games

Asian Games Badminton: చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్.. స్వర్ణం కైవసం

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 07, 2023 02:29 PM IST

Satwik - Chirag: ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు మరో స్వర్ణ పతకం వచ్చింది. భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ సాధించి.. చరిత్ర సృష్టించారు.

స్వర్ణం గెలిచాక సంబరాలు చేసుకుంటున్న సాయిరాజ్, చిరాగ్
స్వర్ణం గెలిచాక సంబరాలు చేసుకుంటున్న సాయిరాజ్, చిరాగ్ (AP)

Satwik - Chirag Asian Games: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి చరిత్ర సృష్టించారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో చిరాగ్ - సాయిరాజ్ ద్వయం స్వర్ణ పతకంతో సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 7) జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‍లో చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‍ల్లో కొరియా ద్వయం చోయి సోల్ గ్యు, కిమ్ వోన్ హొను చిత్తు చేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‍లో భారత్ స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్.

ట్రెండింగ్ వార్తలు

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్‍లో భారత ద్వయం చిరాగ్ - సాత్విక్ తొలి గేమ్‍లో ఓ దశలో 15-18తో వెనుకబడ్డారు. అయితే, ఆ దశలో పుంజుకున్నారు. కొరియా జోడీకి చెమటలు పట్టించారు. వరుస పాయింట్లతో సత్తాచాటారు. దీంతో 21-18తో తొలి గేమ్‍ను చిరాగ్ - సాత్విక్ సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‍లో ఆరంభం నుంచే భారత షటర్లు జోరు చూపించారు. ఆసాంతం ఆధిపత్యం చూపారు. చివరికి 21-16తో గేమ్ గెలిచారు. వరుస గేమ్‍ల్లో ఫైనల్ గెలిచి.. స్వర్ణ పతకాన్ని చిరాగ్ - సాత్విక్ జోడీ కైవసం చేసుకుంది. చరిత్ర సృష్టించింది.

చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్‌లో రెండేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కామన్‍వెల్త్ క్రీడల్లో స్వర్ణం, థామస్ కప్ గోల్డ్, 2022 ప్రపంచ చాంపియన్‍షిప్‍లో కాంస్య పతకం సాధించారు. అలాగే, చాలా టోర్నీల్లో గెలిచి రికార్డులు సృష్టించింది చిరాగ్ - సాత్విక్ జోడీ.

ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు (అక్టోబర్ 7, మధ్యాహ్నం) 101 పతకాలు సాధించింది. ఇందులో 26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు ఉన్నాయి.

WhatsApp channel