(1 / 8)
ఉగాది వేడుకలకు ముందు ముఖ్యమంత్రి జగన్ దంపతులు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(2 / 8)
వైఎస్ భారతి నుదుటన తిలకం దిద్దారు ముఖ్యమంత్రి జగన్.
(3 / 8)
సీఎం జగన్ కు ఆయన సతీమణి భారతి తిలకం దిద్దారు.
(4 / 8)
నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు.
(5 / 8)
ఉగాది వేళ పంచాంగ శ్రవణం నిర్వహించారు. సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
(6 / 8)
ముఖ్యమంత్రి జగన్ దంపతులకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
(7 / 8)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరమంతా ప్రజలకు మంచి జరగాలని ఆకాక్షించిన ముఖ్యమంత్రి జగన్. రైతులకు మేలు జరగాలని.. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
(8 / 8)
ఉగాది వేడుకల్లో భాగంగా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఉట్టిపడేలా సంబరాలు జరిపారు. ఇందులో భాగంగా పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇతర గ్యాలరీలు