(1 / 7)
గ్రూప్-3 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. . మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే
గ్రూప్-3 నోటిఫికేషన్లో ఖాళీల వివరాల రివైజ్డ్ బ్రేకప్ను మే 3వ తేదీన వెల్లడించింది.
(photo source from https://unsplash.com/)(2 / 7)
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-3 పోస్టుల భర్తీకి ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
(3 / 7)
గ్రూప్-3 పోస్టుల భర్తీలో జీవో 3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో 'గ్రూప్-3' నోటిఫికేషన్లో ఖాళీల వివరాలకు సంబంధించిన రివైజ్డ్ బ్రేకప్ను కమిషన్ మే 3న ప్రకటించింది https://websitenew.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
(4 / 7)
1,388 గ్రూప్-3 పోస్టులకుగాను మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ పడుతున్నారు. గ్రూప్ 3లో మొత్తం మూడు పరీక్షా పేపర్లు ఉంటాయి.
(5 / 7)
గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత…. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాగా… కొత్తగా మరిన్ని పోస్టులు జమ అయ్యాయి దీంతో ఈ సంఖ్య 1388కి చేరింది.
(6 / 7)
మొత్తం ఖాళీల్లో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్: పోస్టులు 680గా , సీనియర్ అకౌంటెంట్: (436) ఉద్యోగాలు ఉన్నాయి.
(photo source from https://unsplash.com/)(7 / 7)
గ్రూప్ 3 ఎగ్జామ్ మొత్తం 450 మార్కులకు ఉంటుంది. మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఇతర గ్యాలరీలు