(1 / 8)
మే నెలలో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో 48,610 యూనిట్లను విక్రయించింది హ్యుందాయ్ మోటార్ ఇండియా.
(2 / 8)
గతేడాది ఇదే నెలలో 42,293 యూనిట్లను విక్రయించింది. అంటే ఈసారి 14.91శాతం వృద్ధిని నమోదు చేసినట్టు.
(3 / 8)
క్రేటా, వెన్యూ వంటి ఎస్యూవీ మోడల్స్కు గత నెలలోనూ మంచి డిమాండ్ కనిపించింది.
(4 / 8)
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన అప్డేటెడ్ హ్యుందాయ్ వెర్నా సెడాన్కి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
(5 / 8)
ఇక గత నెలలో 11,000 యూనిట్ను ఎగుమతి చేసింది హ్యుందాయ్ మోటార్. 2022 మేలో ఈ నెంబర్ 8,970గా ఉండేది.
(6 / 8)
దేశ, విదేశీ సేల్స్ను కలుపుకుంటే మే నెలలో హ్యుందాయ్ మోటార్ మొత్తం మీద 59,601 యూనిట్లను విక్రయించింది.
(7 / 8)
హ్యుందాయ్కు ఇండియాలో మంచి ఎస్యూవీ పోర్ట్ఫోలియో ఉంది. ఇక త్వరలోనే ఈ పోర్ట్ఫోలియోలో ఎక్స్టర్ ఎస్యూవీ చేరనుంది.
(8 / 8)
హ్యుందాయ్ ఎక్స్టర్.. జూన్ 10న ఇండియాలో లాంచ్ అవుతుంది.
ఇతర గ్యాలరీలు