Priyanka Gandhi : 2024 లోక్సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ!
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఈ విషయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ.. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను తన భూజాల మీద వేసుకుని, నేతలను ముందుండి నడిపించారు. అయితే ఇప్పటివరకు ఆమె ఒక్కసారి కూడా ఎన్నికల క్షేత్రంలోకి దిగలేదు. ఇక 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ ఎన్నికల ఎంట్రీపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా?
ఉత్తర్ ప్రదేశ్ రాయ్బరేలీ, అమేఠీ ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ చాలా ఏళ్లుగా క్రియాశీలకంగా ఉంటున్నారు. కాగా.. 2022 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారని వార్తలు జోరుగా సాగాయి. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అని జోరుగా ప్రచారాలు జరిగాయి. కానీ వాస్తవానికి ఇవేవీ జరగలేదు. ఆమె ఇంకా ఎన్నికల బరిలో దిగలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
Priyanka Gandhi latest news : "ప్రియాంక గాంధీ కచ్చితంగా లోక్సభలో ఉండాలి. లోక్సభలో ఉండేందుకు కావాల్సిన అర్హత ఆమెకు ఉంది. పార్లమెంట్లో ఆమె చాలా బాగా ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తిస్తుందని, ఆమె నుంచి పార్టీ ఇంకా ప్రయోజనాలు పొందుతుందని భావిస్తున్నాను," అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ వాద్రా అన్నారు.
ఇదీ చూడండి:- Priyanka Gandhi: ప్రియాంక గాంధీపై పోలీస్ కేసు; ఆ ఆరోపణలు చేసినందుకే..
ఈ క్రమంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రియాంక గాంధీ భర్త.
"గౌతమ్ అదానీతో నాకు సంబంధం ఉందని స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. కానీ పేరు వస్తే మాత్రమే, పోరాడుతాను. గౌతమ్ అదానీతో కలిసి నేను చేసిన ఒక్క పనినైనా చూపించండి. లేకపోతే క్షమాపణలు చెప్పాల్సిందే. గౌతమ్ అదానీతో విమానంలో ప్రయాణించిన మోదీ ఫొటో అందరి దగ్గర ఉంది. మరి దానిపై మేము ఎందుకు ప్రశ్నించకూడదు? రాహుల్ గాంధీ ప్రశ్నించినా సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు?" అని ప్రశ్నించారు రాబర్ట్ వాద్రా.
ప్రియాంకను కాంగ్రెస్ బరిలో దింపుతుందా?
2024 Lok Sabha election Congress : రాయ్బరేలీ, అమేఠీలు కాంగ్రెస్కు కంచుకోటలుగా వస్తూ ఉన్నాయి. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తన అమేఠీ సీటును స్మృతి ఇరానీకి కోల్పోయారు. ఇక రాయ్బరేలీలో సోనియా గాంధీ ఎంపీగా దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ.. ప్రముఖ నేతగా ఎదిగారన్న విషయం వాస్తవమే. అంతేకాకుండా.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆమె ప్రణాళికలకు, పార్టీని ముందిండి నడిపించిన తీరుకు ప్రశంసలు కూడా అందాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలో దింపుతుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. 2024 సార్వత్రికం వరకు ఎదురు చూడాల్సిందే!
సంబంధిత కథనం