PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్ వరదలపై ప్రధాని మోదీ ట్వీట్
PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్ వరదలతో ప్రభావితమైన బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్ వరదలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
"పాకిస్థాన్లో వరదలు సృష్టించిన బీభత్సం గురించి విని చాలా బాధ కలిగింది. బాధితులు, గాయపడిన వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. పాకిస్థాన్లో పరిస్థితులు తొందరగా సాధారణ స్థితికి చేరాలని ప్రార్థిస్తున్నాము," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఆ దేశంలో 5.7మిలియన్ మందిపై పాకిస్థాన్ వరదల ప్రభావం పడింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.
1,100కు చేరువలో మరణాల సంఖ్య..
Pakistan floods death toll : పాకిస్థాన్ వరదల్లో మృతుల సంఖ్య ఆదివారం 1000 మార్కును దాటగా.. సోమవారం అది 1,100కు చేరువైంది. మొత్తం మీద వరదలకు ఇప్పటివరకు 1,061మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండటం ఆందోళనకరం. 1,575మంది గాయపడ్డారు.
పరిస్థితులు చూస్తుంటే.. పాక్పై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది! అక్కడి సహాయక చర్యలపైనా వరదల ప్రభావం పడుతోంది. సింధ్ నదిపై.. 30మందితో వెళుతున్న ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. అనేకమంది గల్లంతయ్యారు. ఏడుగురుని అధికారులు రక్షించారు.
దేశవ్యాప్తంగా 9,92,871 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 10లక్షలకుపైగా మంది ప్రజలు.. ఆహారం, తాగు నీరు లేని పరిస్థితుల్లో ఉన్నారు.
పాకిస్థాన్ వరదలకు 7,19,558 జంతువులు మరణించాయి. లక్షలాది ఎకరాల పంట భూమి నీటమునిగింది.
Pakistan floods 2022 : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తల మీద వరదల రూపంలో మరో భారం పడింది. సాయం చేయాలని వివిధ దేశాలను పాకిస్థాన్ అభ్యర్థిస్తోంది.
పాకిస్థాన్ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్టు అంచనా. పాకిస్థాన్లో తాజా పరిస్థితిని పరిశీలించిన ఐక్యరాజ్య సమితి.. ఆ దేశానికి తక్షణమే 160 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది. అదే సమయంలో.. పాకిస్థాన్ మిత్రపక్షాలు కూడా.. తమ వంతు సాయం చేస్తున్నాయి. 1.5మిలియన్ పౌండ్ల సాయాన్ని ప్రకటించింది యూకే. నిధులతో పాటు 3వేల టన్నుల ఆహార పదార్థాలను కూడా పాక్కు పంపుతోంది యూఏఈ.
పాక్ తాజా పరిస్థితులపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాక్కు సాయం చేస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం.
సంబంధిత కథనం