National Curriculum Framework : ఇకపై 2వ తరగతి వరకు రాత పరీక్షలు బంద్​!-no written exams till class 2 draft national curriculum framework proposes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  No Written Exams Till Class 2, Draft National Curriculum Framework Proposes

National Curriculum Framework : ఇకపై 2వ తరగతి వరకు రాత పరీక్షలు బంద్​!

Sharath Chitturi HT Telugu
Apr 08, 2023 11:12 AM IST

National Curriculum Framework 2023 : పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు.. 2వ తరగతి వరకు రాత పరీక్షలను నిర్వహించకూడదని ప్రతిపాదించింది ఎన్​సీఎఫ్​ ముసాయిదా. 3వ తరగతి నుంచి రాత పరీక్షలను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది.

2వ తరగతి వరకు రాత పరీక్షలు బంద్!
2వ తరగతి వరకు రాత పరీక్షలు బంద్! (freepik )

National Curriculum Framework 2023 : ఇకపై 2వ తరగతి వరకు రాతపరీక్షలు ఉండకపోవచ్చు! ఈ మేరకు ఎన్​సీఎఫ్​ (నేషనల్​ కరికులమ్​ ఫ్రేమ్​వర్క్​) ముసాయిదా సిఫార్సు చేసింది. 2వ తరగతి, అంత కన్నా తక్కువ వయస్సున్న పిల్లల తెలివిని అంచనా వేసేందుకు రాత పరీక్షలు నిర్వహించడం సరైన పద్ధతని కాదని పేర్కొంది. 'అసెస్​మెంట్​' పద్ధతులు.. పిల్లలపై అదనపు భారం వేసే విధంగా ఉండకూడదని స్పష్టం చేసింది. 3వ తరగతి నుంచి రాత పరీక్షలు మొదలుపెట్టొచ్చని సిఫార్సు చేసింది.

పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు..!|

నేషనల్​ ఎడ్జ్యుకేషన్​ పాలసీ (ఎన్​ఈపీ)లో భాగంగా ఈ ముసాయిదాను రూపొందించారు. ఫండమెంటల్​ స్టేజ్​ (2వ తరగతి వరకు)లో ఉన్న విద్యార్థల అబ్జర్వేషన్లు, నేర్చుకున్న అంశాలపై వారి విశ్లేషణల ఆధారంగా అసెస్​మెంట్​ చేయాలని ముసాయిదా సూచిస్తోంది. అంతేకానీ.. పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని స్పష్టం చేసింది.

National Curriculum Framework : "పిల్లలు చదువులో అసెస్​మెంట్లు వైవిధ్యంగా ఉండాలి. ఒక్కో విద్యార్థి, ఒక్కో విధంగా నేర్చుకుంటాడు. ఒక్కో విధంగా అర్థం చేసుకుంటాడు. నేర్చుకున్న దానిని అసెస్​ చేసేందుకు చాలా విధానాలు ఉండొచ్చు. వాటిని ఉపయోగించుకునే శక్తి టీచర్​కు ఉండాలి. రికార్డింగ్​, డాక్యుమెంటేషన్​ రూపంలో అసెస్​మెంట్​ ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు రికార్డు చేసి, ఎనలైజ్​ చేసి పిల్లల ప్రొగ్రెస్​ను అంచనా వేయాలి. అదే సమయంలో ఈ అసెస్​మెంట్​లు పిల్లలపై అదనపు భారాన్ని మోపకూడదు. చదువులో భాగంగానే అసెస్​మెంట్​ చేస్తున్నట్టుగా ఉండాలి," అని ఎన్​సీఎఫ్​ ముసాయిదా పేర్కొంది.

3వ తరగతిలో రాత పరీక్షలు ప్రారంభించాలని ఎన్​సీఎఫ్​ ముసాయిదా చెబుతోంది.

Class 2 written exams cancelled : "ప్రిపొరేటరీ స్టేజ్​ (3-5 తరగతి)లో రాత పరీక్షలను ప్రవేశపెట్టాలి. చదువును ప్రమోట్​ చేస్తున్నట్టుగా పరీక్షలు ఉండాలి. భారంగా ఉండకూడదు. విద్యార్థుల పనితనం బట్టి వారి ప్రొగ్రెస్​ను చూడాలి. మిడిల్​ స్కూల్​ (6-8)లో సంభావిత అవగాహన (కాన్సెప్ట్యువల్​ అండర్​స్టాండింగ్​)పై ఆధారపడి ఉండాలి. ఇక 9-12 (సెంకడరీ స్టేజ్​) తరగతుల్లో చెప్పే చదువు ప్రాక్టికల్​గా, అర్థవంతంగా, నిర్మాణాత్మక అభిప్రాయాలతో కలిగి ఉండాలి," అని ముసాయిదా చెబుతోంది.

ఎన్​సీఎఫ్​ను ఇప్పటివరకు నాలుగు సార్లు (1975, 1988, 2000, 2005) సవరించారు. ఇది ఐదోసారి అవుతుంది. కొత్త ఎన్​సీఎఫ్​ ఆధారంగా రూపొందించిన పుస్తకాలు.. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం