Kohinoor diamond : ‘జగన్నాథుడిదే కోహినూర్​.. భారత్​కు తీసుకురావాలి’-kohinoor diamond belonged to lord jagannath odisha organisation after queen s death ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'Kohinoor Diamond Belonged To Lord Jagannath': Odisha Organisation After Queen's Death

Kohinoor diamond : ‘జగన్నాథుడిదే కోహినూర్​.. భారత్​కు తీసుకురావాలి’

Sharath Chitturi HT Telugu
Sep 13, 2022 07:20 AM IST

Kohinoor diamond Lord Jagannath : బ్రిటన్​ రాణికి చెందిన కిరీటంలో ఉన్న కోహినూర్​ డైమండ్​.. పూరీ జగన్నాథుడిది అని పలువురు పేర్కొన్నారు. దానిని ఇండియాకు తీసుకురావాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

‘జగన్నాథుడిదే కోహినూర్​.. భారత్​కు తీసుకురావాలి’
‘జగన్నాథుడిదే కోహినూర్​.. భారత్​కు తీసుకురావాలి’ (HT file photo)

Kohinoor diamond Lord Jagannath : క్వీన్​ ఎలిజబెత్​ మరణం తర్వాత కోహినూర్​ డైమండ్​ ఉన్న కిరీటం వార్తలకెక్కింది. ఆ కోహినూర్​ డైమండ్​ పూరీలోని జగన్నాథుడిది అని, తమ పాలనలో బ్రిటీషర్లు దానిని తీసుకెళ్లిపోయారని తాజాగా కొందరు ఆరోపించారు. పూరీ జగన్నాథుడికి చెందిన కోహినూర్​ డైమండ్​ను తీరిగి దేశానికి తీసుకురావాలని, ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ముకు మెమొరాండమ్​ని అందించింది పూరీలోని శ్రీ జగన్నాథ్​ సేన.

'మా దేవుడిదే ఆ డైమండ్​..'

96ఏళ్ల వయస్సులో.. అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు క్వీన్​ ఎలిజబెత్​. ఆమె మరణం అనంతరం ఎలిజబెత్​ కుమారుడు ప్రిన్స్​ చార్లస్​ రాజుగా బాధ్యతలు స్వీకరించారు.

Queen Elizabeth death : ఎలిజబెత్​ మరణం అనంతం కోహినూర్​ ఉన్న కిరీటం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. అందుకు తగ్గట్టుగానే సామాజిక మాధ్యమాల్లో ‘కోహినూర్’​ ట్రెండింగ్​గా మారింది. అయితే.. కోహినూర్​పై ఇండియాకు 100శాతం హక్కులు ఉన్నాయని, దానిని తిరిగి ఇచ్చేయాలని వేలాది మంది ట్వీట్ల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ కోహినూర్​ వ్యవహారం మరోమారు హాట్​టాపిక్​గా మారింది.

ఇక ఇప్పుడు.. ఈ కోహినూర్​ డైమండ్​ పూరీ జగన్నాథుడిదే అని పలువురు ఆరోపించారు.

"ఆ కోహినూర్​ డైమండ్​ శ్రీ జగన్నాథుడికి చెందినది. మహారాజా రంజిత్​ సింగ్​.. దానిని జగన్నాథ భగవానుడికి విరాళంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు అది క్వీన్​ ఆఫ్​ ఇంగ్లాండ్ వద్ద ఉంది.​ దానిని వెనక్కి తీసుకురావాలని మీరు ప్రధానికి విజ్ఞప్తి చేయండి," అని ద్రౌపది ముర్ముకు అందించిన మెమొరాండమ్​లో పేర్కొంది శ్రీ జగన్నాథ్​ సేన.

Queen Elizabeth Kohinoor crown : చరిత్రకారుల ప్రకారం.. పంజాబ్​ మహారాజు రంజిత సింగ్​, అఫ్గానిస్థాన్​ రాజు నదీర్​ షాపై యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గెలిస్తే పూరీ జగన్నాథుడికి కోహినూర్​ని విరాళంగా ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. నదీర్​ షాపై జరిగిన యుద్ధంలో ఆయన విజయం సాధించారు. అయితే.. కోహినూర్​ని పూరీ జగన్నాథుడికి ఇవ్వలేదు!

1839లో రాజా రంజిత్​ సింగ్​ మరణించారు. 10ఏళ్ల తర్వాత.. రంజిత్​ సింగ్​ కుమారుడు దులీప్​ సింగ్​ నుంచి బ్రిటీషర్లు ఆ కోహినూర్​ డైమండ్​ను తీసుకుని ఇంగ్లాండ్​కు పట్టుకెళ్లిపోయారు. అప్పటి నుంచి అది ఇండియాకు తిరిగిరాలేదు.

ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా కోహినూర్​ గుర్తింపు పొందింది. 14వ శతాబ్దంలో కాకతీయుల రాజ్యంలో.. కొల్లూర్​ గనుల నుంచి దీనిని తొలిసారిగా బయటకు తీసినట్టు చరిత్ర సూచిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం