Independence Day 2023: 77 వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం భారత్ సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్ర కోట వద్ద మన జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ జెండా ప్రాముఖ్యత తెలిపేలా, జెండా విలువపై అవగాహన పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కీ అమృత మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమంలో భాగంగా ‘ప్రతీ ఇంటా.. మువ్వన్నెల జెండా (Har Ghar Tiranga) ’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించింది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన స్వాతంత్య్రోద్యమంలో మూడు రంగుల జెండాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ జెండా చేతబూని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సత్యాహింసలు ఆయుధాలుగా, మహాత్మాగాంధీ నాయకత్వంలో అశేష భారతావని స్వాతంత్య్రం మా జన్మహక్కని నినదిస్తూ, ఉద్యమ ప్రస్థానంలో ముందడుగు వేసింది. చివరకు, దాదాపు 200 ఏళ్ల వలస పాలనకు చరమగీతం పాడుతూ, 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం సాధించుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ జెండా కు సంబంధించిన అరుదైన విశేషాలు మీ కోసం..
టాపిక్