IIT JAM 2024: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ (IIT), ఐఐఎస్సీ (IISc), ఎన్ఐటీ (NIT) ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ మరో అవకాశం కల్పిస్తోంది. ఆయా విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (Joint Admission test for Masters - JAM) కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 25 లోపు ఆన్ లైన్ లో ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (Joint Admission test for Masters - JAM) అడ్మిషన్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే విద్యార్థులు పూర్తి వివరాల కోసం జామ్ అధికారిక వెబ్ సైట్ jam.iitm.ac.in. ను పరిశీలించాలి. jam.iitm.ac.in. ద్వారానే ఈ టెస్ట్ కు అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష నిర్వహణను వేర్వేరు విద్యా సంస్థలకు ఇస్తుంటారు. ఈ సంవత్సరం ఐఐటీ, మద్రాస్ ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ను నిర్వహిస్తోంది.
ఈ సంవత్సరం ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ - జామ్ (JAM) కు అప్లై చేసుకునే అవకాశం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కల్పించారు. అక్టోబర్ 20వ తేదీతో ముగిసిన లాస్ట్ డేట్ ను అక్టోబర్ 25 వరకు పొడిగించారు. అప్లై చేసిన విద్యార్థులకు అడ్మిట్ కార్డ్స్ జనవరి 8వ తేదీ నుంచి jam.iitm.ac.in. వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ జామ్ పరీక్ష 2024, ఫిబ్రవరి 11వ తేదీన జరుగుతుంది. ఫలితాలను మార్చి 22వ తేదీన ప్రకటిస్తారు. స్కోర్ కార్డ్స్ jam.iitm.ac.in. వెబ్ సైట్లో ఏప్రిల్ 2 వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.
ఈ పరీక్షకు అప్లై చేయడానికి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. డిగ్రీ ఫైనల్ ఈయర్ లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అడ్మిషన్ సమయానికి డిగ్రీ పూర్తియనట్లుగా సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ జామ్ పరీక్ష కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.