EMRS Notification 2023 : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్(EMRS)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 10,391 పోస్టుల భర్తీకి దరఖాస్తులు గడువు మరోసారి పొడిగించారు. అక్టోబర్ 19 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ద్వారా గుర్తింపు పొందిన మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ పొందిన అభ్యర్థులు పీజీటీ, టీజీటీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్ చివరిలో నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 4,062 పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ గెస్ట్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, గెస్ట్ లెక్చరర్, ల్యాబ్ అటెండెంట్, కుక్, హెల్పర్, స్వీపర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. అక్టోబర్ 19 లోపు అధికారిక వెబ్సైట్ recruitment.nta.nic.inని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఏడాది జూన్ లో 4,062 పోస్టులకు ఆ తర్వాత కొద్ది రోజులకు మరో 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా 10,391 పోస్టులను భర్తీ చేయనున్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ వెబ్సైట్ను సందర్శించి అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వనున్నారు.