Indonesia Football Match Stampede : ఫుట్​బాల్​ మ్యాచ్​ ఘటనలో 174కి చేరిన మృతులు!-deaths in indonesia football match stampede climb to 174 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Deaths In Indonesia Football Match Stampede Climb To 174

Indonesia Football Match Stampede : ఫుట్​బాల్​ మ్యాచ్​ ఘటనలో 174కి చేరిన మృతులు!

Sharath Chitturi HT Telugu
Oct 02, 2022 01:35 PM IST

Indonesia Football Match Stampede death toll : ప్రపంచాన్ని షాక్​కు గురిచేసిన ఇండోనేషియా హింసాకాండ ఘటనలో మృతుల సంఖ్య 174కి చేరింది. మరో 180కిపైగా ప్రజలు గాయపడ్డారు.

ఫుట్​బాల్​ మ్యాచ్​ ఘటనలో గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న సహాయక సిబ్బంది
ఫుట్​బాల్​ మ్యాచ్​ ఘటనలో గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న సహాయక సిబ్బంది (REUTERS)

Indonesia Football Match Stampede death toll : ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండలో మృతుల సంఖ్య 174కి చేరింది. ఈ ఘటనలో మరో 180మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

"ఉదయం 9:30 గంటలకు మృతుల సంఖ్య 158గా ఉంది.. 10:30కి 174కి చేరింది. మరణాలు ఇంకా పెరగవచ్చు," అని తూర్పు జావా డిప్యూటీ గవర్నర్​ ఎమిల్​ డార్​డట్​.. స్థానిక మీడియాకు వెల్లడించారు.

ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ రక్తపాతం.. శనివారం రాత్రి మలంగ్​ నగరంలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్టేడియాల్లో జరిగిన ఘోరమైన ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ఘటనాస్థలంలో విషాదకర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కాలిపోయిన పోలీసు వ్యాన్​, గాయలతో పడి ఉన్న క్షతగాత్రులు, సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆసుపత్రుల్లో సైతం ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధితుల్లో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉందని వైద్యులు చెప్పారు.

Indonesia football match riot : అసలేం జరిగింది..?

పోలీసుల కథనం ప్రకారం.. స్టేడియంలో మ్యాచ్​ జరుగుతున్న సమయంలో 42వేల మంది ఉన్నారు. ఓ 3000వేల మంది ఒక్కసారిగా పిచ్​పైకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాష్పవాయువును ప్రయోగించి, పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితులు తొక్కిసలాటకు దారి తీశాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

<p>ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబసభ్యుల రోదన</p>
ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబసభ్యుల రోదన

స్టేడియంలో ఉన్న వారి కథనం మాత్రం భిన్నంగా ఉంది. తొలుత హింసాకాండ ఏమీ లేదని, పోలీసులు బాష్పవాయువును ఎందుకు ప్రయోగించారో తమకు అర్థం కాలేదని అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో.. తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.

Indonesia Football Match Stampede : ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండపై అధ్యక్షుడు జోకో విడోడో దర్యాప్తునకు ఆదేశించారు. ఫుట్​బాల్​ మ్యాచ్​ల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పరిస్థితులు చక్కబడేంత వరకు దేశంలో ఫుట్​బాల్​ మ్యాచ్​లు నిలిపివేయాలని ఆదేశించారు.

ఇండోనేషియాలో సాధారణమే..!

ఫుట్​బాల్​ మ్యాచ్​లో హింసాకాండ జరగడం ఇండోనేషియాలో సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది! మ్యాచ్​ని ఓ క్రీడా గా చూడకుండా.. శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అక్కడి అభిమానులు. అరేమా ఎఫ్​సీ, పెర్​సెబాయ సురబాయ జట్ల మధ్య దీర్ఘకాలంగా తీవ్ర పోటీ నడుస్తోంది. అదే సమయంలో ఆ జట్ల అభిమానుల మధ్య తీవ్ర శత్రుత్వం కొనసాగుతోంది.

Indonesia Football Match news : ఇండోనేషియా ఫుట్​బాల్​ మ్యాచ్​ హింసాకాండలో అధికారుల తప్పు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం 38000 టికెట్లే అమ్మాలని ఆదేశాలు అందినా.. 42వేల టికెట్లు అమ్మేశారు. అంతేకాకుండా.. హింస జరుగుతుందన్న అనుమానంతో పెర్​సెబాయ జట్టు అభిమానులను లోపలికి అనుమతించకూడందని తీసుకున్న నిర్ణయాన్ని సైతం పక్కన పడేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం