DA hike : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 3శాతం డీఏ పెంపు!-3 precent da hike announced for govt employees of this state ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  3 Precent Da Hike Announced For Govt Employees Of This State

DA hike : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 3శాతం డీఏ పెంపు!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 03:02 PM IST

DA hike : ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్రం గుడ్​ న్యూస్​ ఇచ్చింది. 3శాతం డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 3శాతం డీఏ పెంపు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. 3శాతం డీఏ పెంపు! (HT_PRINT)

DA hike : గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పారు. 7వ పే కమిషన్​లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను 3శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. 2022 జనవరి 1 నుంచి ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

అరావల్లి జిల్లాలో.. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు గుజరాత్​ సీఎం. జెండా వందనం అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి భూపేంద్ర పటేల్​ ప్రసంగించారు. ప్రజలు.. దేశ ప్రయోజనాలకు తమ జీవితంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు వార్తను అందించారు.

గుజరాత్​లో రాష్ట్ర ప్రభుత్వం కింద 9.38లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా డీఏ పెంపుతో పంచాయత్​ సేవలు, పింఛనుదారులు సైతం లబ్ధిపొందనున్నారు. కాగా.. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై వార్షికంగా రూ. 1,400 కోట్ల భారం పడనుందని సీఎం వివరించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరిచారు గుజరాత్​ సీఎం. రానున్న రోజుల్లో ప్రవేశపెట్టే పథకాలను సైతం ప్రస్తావించారు. ద్వారక, అంబాజీ, ఐక్యతా విగ్రహం వద్ద ఎలక్ట్రిక్​ బస్సు సేవలను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. బీఎస్​-జీకి చెందినన 1,200 కొత్త బస్సులను సైతం తీసుకొస్తామని వెల్లడించారు. దీని వ్యయం రూ. 367కోట్లు అని అన్నారు. ప్రజల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్