Jammu and Kashmir : ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు హతం.. కానీ!-100 terrorists killed so far in jammu and kashmir this year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  100 Terrorists Killed So Far In Jammu And Kashmir This Year

Jammu and Kashmir : ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు హతం.. కానీ!

Sharath Chitturi HT Telugu
Jun 12, 2022 05:27 PM IST

Jammu and Kashmir : ఈ ఏడాది ఇప్పటివరకు 100మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కానీ దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు హతం.. కానీ!
ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు హతం.. కానీ! (HT_PRINT/file)

Jammu and Kashmir : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. అంటే ఆరు నెలల్లో 100మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. వీరిలో 30మంది పాకిస్థాన్​ దేశస్థులు సైతం ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆదివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఫలితంగా.. జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాది మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 100కు చేరింది.

కశ్మీర్​ లోయ నుంచి ఉగ్రవాదులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. సరిహద్దు నుంచి చొరబాట్లు, యువతను ఉగ్రవాదంలోకి నియమించుకునే ప్రక్రియ సైతం జోరుగా సాగుతోంది. కశ్మీర్​ లోయలో ఇప్పటికీ వివిధ ఉగ్రసంస్థలకు చెందిన 158 ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లష్కరే తోయిబాకు చెందినవారే! అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కశ్మీర్​ లోయలో 83మంది ఎల్​ఈటీ ముష్కరులు ఆశ్రయం పొందుతున్నారు. మరో 30మంది జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు ఉన్నరు. వీరితో పాటు 38మంది హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులు కూడా కశ్మీర్​ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ఉరి, కశ్మీర్​ వెలుపల ఉన్న టెర్రర్​ లాంచ్​ ప్యాడ్స్​లో కార్యకలాపాలు ఊపందుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. పాకిస్థాన్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ ఐఎస్​ఐ.. వందలాది మంది లష్కర్​, జైషే, అఫ్గాన్​ ఉగ్రవాదులకు ట్రైనింగ్​ ఇచ్చి.. లాంచ్​ ప్యాడ్స్​కు పంపుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దు వెంబడి దేశంలోకి చొరబడి.. అమర్​నాథ్​ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు వీరు ప్రణాళికలు రచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అమర్​నాథ్​ యాత్రలో విధ్వంసం..!

Amarnath yatra 2022 : అమర్​నాథ్​ యాత్రలోని భద్రతా బలగాలపై బాంబు దాడులు జరగవచ్చు. ఎన్​హెచ్​-44పై విధ్వంసం సృష్టించేందుకు ఎల్​ఈటీ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు భద్రతా బలగాలకు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది.

అప్రమత్తమైన అధికారులు.. 400కుపైగా పారామిలిటరీ కంపెనీలను రంగంలోకి దింపారు. కట్టుదిట్టమైన భద్రతు ఏర్పాటు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం