Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్-sundeep kishan starred ooru peru bhairavakona teaser relased ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్

Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్

Maragani Govardhan HT Telugu
May 07, 2023 07:17 PM IST

Ooru Peru Bhairavakona Teaser: సందీప్ కిషన్ నటిస్తున్న సరికొత్త చిత్రం ఊరు భైరవకొన. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

ఊరు పేరు భైరవకొన టీజర్ విడుదల
ఊరు పేరు భైరవకొన టీజర్ విడుదల

Ooru Peru Bhairavakona Teaser: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది మైఖేల్ అనే పాన్ ఇండియా చిత్రంతో సందడి చేశాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో సందీప్ తన తదుపరి మూవీస్‌పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడి నటిస్తున్న సరికొత్త చిత్రం ఊరు పేరు భైరవకొన. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం నాడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

yearly horoscope entry point

ఊరు పేరు భైరవకొన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో చలామణీలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడపురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అనే వాయిస్ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఈ ఊరిలోకి రావడమే కానీ.. బయటకు పోయే దారే లేదు అనే డైలాగ్‌తో ఆకట్టుకుంటుంది. గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకొన అని సందీప్ వాయిస్ ఓవర్‌తో మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

సినిమా మొత్తం విజువల్ వండర్‌గా ఉంటుందని ఈ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

వీఐ ఆనంద్‌తో కలిసి సందీప్ కిషన్ గతంలో టైగర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ దర్శకుడు తెరకెక్కించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై బజ్ ఏర్పడింది.

ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్యా మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేస్తోంది. వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Whats_app_banner