Sundeep gift Aha Subscriptions: ఫ్యాన్స్‌కు సందీప్ కిషన్ అదిరిపోయే ఆఫర్.. ఆహా సబ్‌స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇస్తున్న హీరో-tollywood actor sundeep kishan gift 2000 ott subscriptions to fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundeep Gift Aha Subscriptions: ఫ్యాన్స్‌కు సందీప్ కిషన్ అదిరిపోయే ఆఫర్.. ఆహా సబ్‌స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇస్తున్న హీరో

Sundeep gift Aha Subscriptions: ఫ్యాన్స్‌కు సందీప్ కిషన్ అదిరిపోయే ఆఫర్.. ఆహా సబ్‌స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇస్తున్న హీరో

Maragani Govardhan HT Telugu
Feb 22, 2023 11:04 AM IST

Sundeep gift Aha Subscriptions: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తన అభిమానులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. 2000 ఆహా సబ్‌స్క్రిప్షన్లు తన ఫ్యాన్స్‌కు బహుమతిగా ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఆహా సబ్ స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇస్తున్న సందీప్ కిషన్
ఆహా సబ్ స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇస్తున్న సందీప్ కిషన్

Sundeep gift Aha Subscriptions: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే మైఖేల్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రంజిత్ జీవకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించకపోవడంతో ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా వేదికగా ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆహా ప్లాట్‌ఫాంలో ఫిబ్రవరి 24 నుంచి మైఖేల్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ విడుదల సందర్భంగా సందీప్ కిషన్ తన అభిమానులకు మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. 2000 ఆహా సబ్‌స్క్రిప్షన్లు కానుకగా ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

"డియర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడు నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. సినిమాపై నాకున్న ప్రేమను, ప్రయత్నాలను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందుకే ఆహాలో మైఖేల్ ప్రీమియర్ సందర్భంగా 2 వేల మందికి ఆహా సబ్‌స్క్రిప్షన్లు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ శుక్రవారం మేఖేల్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది." అని సందీప్ కిషన్ పోస్టర్ విడుదల చేశాడు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసింది. అంతేకాకుండా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్. వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.

కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదలైంది.

IPL_Entry_Point