kiara advani: ఫ్రెండ్షిప్కు మించిన బంధం మాది - సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్షిప్పై కియారా కామెంట్స్ వైరల్
సిద్ధార్థ్ మల్హోత్రాకు(Sidharth Malhotra) తనకు మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని అన్నది కియారా అద్వాణీ(Kiara Advani). కాఫీ విత్ కరణ్ షో ప్రోమోలో సిద్ధార్థ్ తో తన లవ్ స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Sidharth Malhotra - Kiara advani: బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రెండేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది కియారా అద్వాణీ. త్వరలోనే ప్రేమ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కియారా అద్వాణీ పుట్టినరోజును దుబాయ్ లో స్పెషల్ గా సిద్ధార్థ్ మల్హోత్రా సెలబ్రేట్ చేశాడు. ఇద్దరు జంటగా దుబాయ్ లో షికార్లు చేసిన ఫొటోలు నెట్టింట షికారు చేశాయి. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై కియారా, సిద్ధార్థ్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. లవ్ స్టోరీ గురించి ఎప్పుడూ అడిగిన ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేస్తూ వస్తున్నారు.
తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు(koffee with karan season 7) షాహిద్ కపూర్ తో కలిసి కియారా అద్వాణీ హాజరైంది. ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో సోమవారం విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్ తో నువ్వు రిలేషన్ షిప్ లో ఉన్నది నిజం కాదా అంటూ కియారా అద్వాణీని కరణ్ జోహార్ ప్రశ్న అడిగారు. అవునని చెప్పలేను అలాగని కాదని అనను అంటూ ఫన్నీగా అతడి ప్రశ్నకు బదులిచ్చింది కియారా.
సిద్ధార్థ్, నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చా అంటూ కరణ్ అడిగిన మరో ప్రశ్నకు తమ మధ్య స్నేహానికి మించిన బంధం ఉంది అంటూ చెప్పింది. ఈ ప్రోమోలో కియారా చెప్పిన సమాధానాలు బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి. సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా కియారా చెప్పిందని అభిమానులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ఈ ప్రోమోలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జోడిని ఉద్దేశించి షాహిద్ కపూర్ గుడ్ లుకింగ్ కపుల్ అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వారి పెళ్లి గురించి షాహిద్ హింట్ ఇచ్చేశాడంటూ బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. షాహిద్ సమాధానికి కొనసాగింపుగా చూడచక్కనైన జోడి అంటూ కరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాపిక్