RC15 Movie Update: శంకర్-చరణ్ సినిమా మరింత ఆలస్యం కానుందా? కియారానే కారణమా?-rc15 to be delayed due to kiara adwani and sidharth malhotra wedding ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc15 To Be Delayed Due To Kiara Adwani And Sidharth Malhotra Wedding

RC15 Movie Update: శంకర్-చరణ్ సినిమా మరింత ఆలస్యం కానుందా? కియారానే కారణమా?

Maragani Govardhan HT Telugu
Jan 10, 2023 08:08 AM IST

RC15 Movie Update: శంకర్-రామ్ చరణ్ కాంబోలో RC15 అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్‌సీ15
ఆర్‌సీ15

RC15 Movie Update: బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన సహచర నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్‌లో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రెండు, మూడేళ్లుగా పీకల్లోతూ ప్రేమల్లో మునిగారని, ఇరువురు చెట్టాపట్టాలేసుకుని డిన్నర్లు, పార్టీలకు వెళ్లడం కెమెరాల కంటికి చిక్కడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.

వీరి పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని, అప్పుడే వివాహ సన్నాహాలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగబోతుందని, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై కియారా, సిద్ధార్థ్ ఇద్దరిలో ఎవ్వరూ కూడా ఇంతవరకు నోరు మెదపలేదు. ఇదిలా ఉంటే వీరి పెళ్లి గురించి మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన RC15 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి ఇప్పటికే శంకర్‌తో చెప్పిందని, దీంతో తన సెలవులను కొన్ని రోజుల పాటు పొడిగించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఫిబ్రవరిలో రెండు వారాల పాటు ఆమె RC15కి గైర్హాజరు కానుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.కమల్‌తో శంకర్ భారతీయుడు-2 పునఃప్రారంభించడంతో చరణ్‌ సినిమా ఆగింది. తాజాగా కియారా వివాహంతో మరి కొన్ని రోజులు ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుస బ్రేక్స్‌తో శంకర్-చరణ్ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్న సినిమాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం