Andhrawala Re Release: రీ రిలీజ్కు సిద్ధమైన ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ
Andhrawala Re Release: ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా రీ రిలీజ్కు సిద్ధమైంది. 2004లో విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
Andhrawala Re Release: ఎన్టీఆర్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన ఆంధ్రావాలా సినిమా మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మార్చిలో రీ రిలీజ్ కాబోతున్నది. 2004లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.
సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది. మరోవైపు ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి బ్లాక్బస్టర్ హిట్స్తో జోరుమీదున్న దర్శకుడు పూరి జగన్నాథ్తో ఎన్టీఆర్తో ఆంధ్రావాలా చేయబోతున్నట్లు ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
రిలీజ్కు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇందులో శంకర్ పహిల్వాన్గా, మున్నాగా డ్యూయల్ రోల్లో ఎన్టీఆర్ నటించాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ కానుండటం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మార్చి నెలాఖరున ఈ సినిమా థియేటర్ల రీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. కాగా ఆర్ఆర్ఆర్ ఘన విజయం తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్ నీల్తో మరో సినిమాను అంగీకరించాడు.