Nag Ashwin on Project K: ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే ఎలా ఉండబోతోంది.. నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పాడో చూడండి-nag ashwin on project k says they are making new cars for the movie all together ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nag Ashwin On Project K Says They Are Making New Cars For The Movie All Together

Nag Ashwin on Project K: ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే ఎలా ఉండబోతోంది.. నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పాడో చూడండి

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 04:41 PM IST

Nag Ashwin on Project K: ప్రభాస్‌ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే మూవీ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. దీనిపై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

ప్రాజెక్ట్ కే మూవీ నుంచి వచ్చిన పోస్టర్
ప్రాజెక్ట్ కే మూవీ నుంచి వచ్చిన పోస్టర్

Nag Ashwin on Project K: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గత కొన్నేళ్లుగా చేసిన, ఇప్పుడు చేయబోతున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీసే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నవే. బాహుబలి నుంచి అతని క్రేజ్‌ టాలీవుడ్‌ను దాటేసి ఇండియా మొత్తం పాకింది. సాహో, రాధేశ్యామ్‌ మూవీలు నిరాశపరిచినా.. రానున్న మూడు సినిమాలపై ఎంతో ఆసక్తి నెలకొంది.

ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కే.. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో అంతకంటే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించేశారు. సలార్‌ షూటింగ్‌ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రాజెక్ట్‌ కే గురించి పెద్దగా విశేషాలు బయటకు రాలేదు.

కొన్ని సినిమాల్లో షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించుకోవడం మనం చూశాం. కానీ ప్రాజెక్ట్‌ కే మూవీ కోసం మాత్రం ఏకంగా కొత్త కార్లనే తయారు చేస్తున్నారని ఇప్పటికే ఓ అప్‌డేట్‌ ఎంతో ఆసక్తి రేపింది. ఇక ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా దీనిపై స్పందించాడు. ఈ మూవీ విశేషాల గురించి చెబుతున్న అతని ఆడియో వైరల్‌ అవుతోంది.

"ఈ సినిమా కొత్తది, స్క్రిప్ట్‌ కొత్తది. బిల్డప్‌ చేసే వరల్డ్‌, టెక్నీషియన్స్‌ కొత్త వాళ్లు. నిజానికి అసలు ఈ సినిమా ఎలా చేయాలో అన్నదానికే చాలా సమయం పడుతోంది. ఈ సినిమా కోసం మొదటి నుంచీ అన్నీ కొత్తగా తయారు చేయాలి. మహానటి సినిమాలో అయితే కార్లు కావాలంటే రెంట్‌కు తీసుకొస్తే సరిపోయింది. కానీ ఈ సినిమాకు కార్లు కావాలంటే లేవు. కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. ఆ రకంగా చూస్తే సినిమా కొత్తగా అయితే ఉంటుంది" అని నాగ్‌ అశ్విన్‌ చెప్పాడు.

గతంలో ఎన్నడూ చూడని విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ మూవీలో ఉండబోతున్నాయని కూడా డైరెక్టర్‌ నాగ్‌ స్పష్టం చేశాడు. వైజయంతీ మూవీస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ కొనసాగుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్, ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రెండు పోస్టర్లు వచ్చిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

టాపిక్