Rajamouli | రాజమౌళిపై మణిరత్నం ప్రశంసల వర్షం
ముగ్గురు లెజెండరీ డైరెక్టర్లు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఇండియన్ సినిమా బెస్ట్ డైరెక్టర్ల లిస్ట్లో నిలిచే మణిరత్నం, రాజమౌళి, సుకుమార్ ఒక చోట చేరి ముచ్చటించారు.
మణిరత్నం.. ఇండియన్ సినిమా గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాయకుడు, దళపతి, రోజా, బాంబేలాంటి ఎన్నో క్లాసిక్ మూవీస్ అందించిన ఘనత అతని సొంతం. ఇక బాహుబలిలాంటి మూవీతో ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాసిన ఘనత రాజమౌళిది. ఈ మధ్యే పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారాడు సుకుమార్. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది?
లెజెండ్ శరవణన్ ఆరుల్ ది లెజెండ్ పేరుతో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి తెలుసు కదా. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడానికి ఈ ముగ్గురు డైరెక్టర్లు వచ్చారు. గతంలోనే ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజైంది. తాజాగా లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మూవీ మేకింగ్ వీడియోలు కూడా ఉన్నాయి.
ఇక ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఓ సినిమాను రెండు పార్ట్లుగా తీసి.. రెండింట్లోనూ విజయం సాధించిన విషయంలో రాజమౌళి తనకు స్ఫూర్తిగా నిలిచాడని అనడం విశేషం. బాహుబలి సినిమాను ఉద్దేశించి మణిరత్నం ఈ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో సుకుమార్ పక్కనే ఉన్నాడు. అతడు కూడా ఇప్పుడు పుష్ప మూవీ రెండు పార్ట్లుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే మంచి సక్సెస్ సాధించడంతో సెకండ్ పార్ట్పై అంచనాలు భారీగా ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్