Kiara Advani: విదేశాల్లో ప్రియుడితో కలిసి బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్న కియారా
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఆదివారం తన పుట్టినరోజును ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నది. ఈ వేడుకల కోసం వీరిద్దరు ఏ దేశానికి వెళ్లారంటే...
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రేమాయణంపై సిద్ధార్థ్, కియారా ఇద్దరు ఇప్పటివరకు బయటపడలేదు. తమ మధ్య ఫ్రెండ్షిప్కు మించిన స్పెషల్ బాండ్ ఉందని పలు వేడుకల్లో కియారా వెల్లడించింది.
సిద్దార్థ్, కియారా ప్రేమలో ఉన్నది నిజమేనంటూ ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో లైగర్ హీరోయిన్ అనన్యా పాండే పేర్కొనడం హాట్టాపిక్గా మారింది. కాగా ఆదివారం కియారా అద్వాణీ బర్త్డే జరిగింది. ఈ పుట్టినరోజును దుబాయ్లో ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్పెషల్గా జరుపుకున్నట్లు తెలిసింది. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇద్దరు ఇటీవలే దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. కియారా బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందునుండే గ్రాండ్ గా సిద్ధార్థ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. దుబాయ్లో ఓ అభిమానితో సిద్ధార్థ్, కియారా కలిసి దిగిన ఫొటో చక్కర్లు కొట్టడంతో వారిద్దరు దుబాయ్ వెళ్లిన విషయం వెలుగులోకివచ్చింది.
మరికొద్ది రోజులు వీరిద్దరు దుబాయ్లోనే షికారు చేయబోతున్నట్లు చెబుతున్నారు. కియారా అద్వాణీ పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ సెట్స్ లో ఆమెతో సంతోషంగా గడిపిన ఓ పాత వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు సిద్ధార్థ్. ఇందులో సిద్ధార్థ్ ఫోన్ పట్టుకొని ముందుకు వెళుతుండగా వెనుక నుండి అతడి భుజాలపై చేతులు వేస్తూ కియారా కనిపించింది. ఎన్నో సంతోషకర క్షణాల్లో తనకు భాగస్వామిగా నిలిచిన నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. తొలిసారి వీరిద్దరు షేర్షా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరిమధ్య బంధం బలపడినట్లు తెలిసింది. త్వరలోనే సిద్ధార్థ్, కియారా పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాపిక్