Ravi Teja | టైగర్ నాగేశ్వరావు కోసం భారీ సెట్.. ఎన్ని కోట్లో తెలుసా?
రవితేజ ప్రధాన పాత్రలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో స్టువర్టుపురం గ్రామాన్ని చూపించడానికి రూ.7 కోట్ల భారీ సెట్ నిర్మిస్తున్నారు. చిత్రంలో ఎక్కువ భాగం ఇక్కడే జరుగుతుందని సమాచారం.
మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రామారావ్ ఆన్ డ్యూటీ త్వరలో విడుదల కానుండగా.. పలు చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. ఓ పక్క ధమాకా షూటింగ్లో పాల్గొంటున్న మాస్ మహారాజా.. మరోపక్క టైగర్ నాగేశ్వరరావు సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నాడు. ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు.
70వ దశకంలో స్టువర్టుపురంలో నివసించిన ఓ దొంగ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో భారీ సెట్కు రూపకల్పన చేస్తున్నారు. 70వ దశకంలో స్టువర్టుపురం గ్రామం ఎలా ఉండేదో.. అలాగే ఉంచడానికి సెట్ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ను దాదాపు రూ.7 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఫిల్మమ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మహానటి, ఎవరు, జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా ఈ సెట్కు రూపకల్పన చేస్తున్నారు.
స్టువర్టుపురం గ్రామం 70వ దశకంలో ఎలాగైతే ఉందో అలాగే నిర్మించడానికి ఇంత భారీ మొత్తం వెచ్చిస్తున్నారు. ఇందుకోసం శంషాబాద్లో 5 ఎకరాల నేలను తీసుకున్ననారు. సినిమాలో మేజర్ షూటింగ్ ఇక్కడే జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ అప్కమింగ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ను వంశీ తెరకెక్కిస్తున్నాడు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. 70వ దశకంలో స్టువర్టుపురంలో హల్చల్ చేసిన దొంగ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది.
సంబంధిత కథనం
టాపిక్