Thalapathy Vijay: విజయ్ వారసుడు ఓటీటీ డీల్ ఫిక్స్- షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్
విజయ్ (Thalapathy Vijay) హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వారసుడు (vaarasudu). తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందో తెలుసా...
బీస్ట్ (Beast) సినిమాతో కమర్షియల్ ఫ్లాప్ను ఎదుర్కొన్నాడు తమిళ అగ్ర హీరో విజయ్. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో కథల ఎంపికలో స్టైల్ను మార్చిన విజయ్ ఈ సారి ఫ్యామిలీ డ్రామా కథాంశంతో వారసుడు సినిమా చేయబోతున్నారు.
ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. వారసుడు సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతున్నట్లు సమాచారం. కాగా వారసుడు డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్ పూర్తికాకముందే డిజిటల్ హక్కులు అమ్ముడుపోవడం ఆసక్తికరంగా మారింది. తమిళంతో పాటు తెలుగు హక్కుల విషయంలో భారీ పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఈ పోటీ మధ్య అమెజాన్ ప్రైమ్ డిజిటన్ రైట్స్ను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. వారసుడు శాటిలైట్ రైట్స్ను సన్ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్కానుంది. ఈ సినిమాలో శరత్కుమార్, ప్రకాష్రాజ్, శ్రీకాంత్, సంగీత, ఖుష్బూ కీలక పాత్రలను పోషించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్