Tesla launch in India : ఇండియాలోకి టెస్లా.. గుజరాత్​లో తొలి ప్లాంట్​! త్వరలోనే ప్రకటన?-tesla to announce india launch in 2024 at vibrant gujarat summit ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla Launch In India : ఇండియాలోకి టెస్లా.. గుజరాత్​లో తొలి ప్లాంట్​! త్వరలోనే ప్రకటన?

Tesla launch in India : ఇండియాలోకి టెస్లా.. గుజరాత్​లో తొలి ప్లాంట్​! త్వరలోనే ప్రకటన?

Sharath Chitturi HT Telugu
Dec 29, 2023 06:03 AM IST

Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీకి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది! గుజరాత్​లో తొలి ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

ఇండియాలోకి టెస్లా.. గుజరాత్​లో తొలి ప్లాంట్​!
ఇండియాలోకి టెస్లా.. గుజరాత్​లో తొలి ప్లాంట్​!

Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓ వార్త బయటకి వచ్చింది. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని, తొలి ప్లాంట్​ని గుజరాత్​లో ఏర్పాటు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 జనవరిలో.. జరగనున్న వైబ్రెంట్​ గుజరాత్​ సదస్సులో పాల్గొనేందుకు ఎలాన్​ మస్క్​ ఇండియాకు వస్తున్నారని, ఆ ఈవెంట్​లోనే ఈ ప్రకటన చేస్తారని అంటున్నాయి.

ఇండియాలోకి టెస్లా..!

దేశంలోకి టెస్లా కార్లను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం- ఎలాన్​ మస్క్​ బృందం మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తొలి ప్లాంట్​ను ఏర్పాటు చేసేందుకు.. మహారాష్ట్ర, గుజరాత్​, తమిళ్​నాడు వంటి రాష్ట్రాలపై టెస్లా ఫోకస్​ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు.. గుజరాత్​ ఫిక్స్​ అయినట్టు నివేదికలు చెబుతునున్నాయి. ఇదే విషయంపై గుజరాత్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి రుషికేశ్​ పటేల్​ సైతం స్పందించారు. ఎలాన్​ మస్క్​.. గుజరాత్​లో పెట్టుబడులు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

Tesla launch in India : ఇండియాలో అధిక టారీఫ్​ల కారణంగా ఇంత కాలం.. ఇక్కడ ఒక్క టెస్లా కారును కూడా విక్రయించలేదు ఎలాన్​ మస్క్​. ఈ విషయంపై ప్రభుత్వం- మస్క్​ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. టారీఫ్​లు తగ్గించాలని ఆయన అంటే.. ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పేది. ఈ క్రమంలోనే.. కొన్ని నెలల క్రితం అమెరికాకు వెళ్లిన మోదీ.. ఎలాన్​ మస్క్​తో సమావేశమయ్యారు. ఆ తర్వాత.. ఇండియాలో ప్లాంట్​ని ఏర్పాటు చేసేందుకు మస్క్​ ఆసక్తి చూపించడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఇండియా ప్రభుత్వం కన్సెషనల్​ డ్యూటీని 15శాతం తగ్గిస్తే.. రెండేళ్లల్లో 2 బిలియన్​ డాలర్ల ఇన్​వెస్ట్​మెంట్​కు తాను సిద్ధమని మస్క్​ చెబుతున్నారట. టారీఫ్​, డ్యూటీ విషయంలో.. ఇప్పటివరకైతే మోదీ ప్రభుత్వం నుంచి టెస్లాకు ఎలాంటి సానూకల స్పందన లభించలేదు.

Tesla India latest news : తొలినాళ్లల్లో 20శాతం మేడ్​ ఇన్​ ఇండియా వాల్యూతో వాహనాలను విక్రయించాలని టెస్లా ప్లాన్​ చేస్తోందట. నాలుగేళ్లల్లో దానిని 40శాతానికి పెంచాలని చూస్తోందట.

Tesla factory in Gujarat : వాస్తవానికి ఇండియాలో టెస్లా ఎంట్రీపై ఒక్కోసారి ఒక్కో వార్త వచ్చింది. మరి ఇప్పుడు.. కచ్చితంగా గుజరాత్​లో ప్లాంట్​ వస్తుందని సంబంధిత వర్గాలు ధీమాగా చెబుతున్నారు. మరి.. ఈ మాటలు నిజమవుతాయా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే.. వైబ్రెంట్​ గుజరాత్​ సదస్సు వరకు ఎదురుచూడాల్సిందే.

WhatsApp channel

సంబంధిత కథనం