Gold and silver rate today : మళ్లీ షాక్​ ఇచ్చిన పసిడి.. రూ. 55వేల ఎగువకు బంగారం ధర!-gold and silver rate today 17th june 2023 check latest prices here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today : మళ్లీ షాక్​ ఇచ్చిన పసిడి.. రూ. 55వేల ఎగువకు బంగారం ధర!

Gold and silver rate today : మళ్లీ షాక్​ ఇచ్చిన పసిడి.. రూ. 55వేల ఎగువకు బంగారం ధర!

Sharath Chitturi HT Telugu

Gold and silver rate today : దేశంలో పసిడి, ప్లాటీనం రేట్లు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 55,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 54,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,000 పెరిగి, రూ. 5,51,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,510గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 వృద్ధి చెంది.. రూ. 60,110కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,670గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4,400 పెరిగి.. రూ. 6,01,100గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,260గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,110గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,420గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,460గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,150గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,160గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,160గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

స్థిరంగా వెండి..

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,310గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,100గా ఉంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,100.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 390 పెరిగి.. రూ 26,000కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,610గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం