Gold and silver prices today : రూ. 63వేలు దాటిన పసిడి ధర- వెండి రేటు ఎంతంటే..-gold and silver prices today 30 march 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 63వేలు దాటిన పసిడి ధర- వెండి రేటు ఎంతంటే..

Gold and silver prices today : రూ. 63వేలు దాటిన పసిడి ధర- వెండి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Mar 30, 2024 05:35 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధిచెందాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 63,010కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 63,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,30,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,301గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 68,740కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 68,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,87,400గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,890గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 68,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,910గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,720గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 63,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 68,740గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,740గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,060గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 68,790గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,740గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,790గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 77,900కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 77,800గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,900.. బెంగళూరులో రూ. 77,100గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం