Tdp Chandra babu : విజన్‌ 2027 లక్ష్యంగా పనిచేయాలన్న చంద్రబాబు-tdp president cbn celebrates independence day at guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Chandra Babu : విజన్‌ 2027 లక్ష్యంగా పనిచేయాలన్న చంద్రబాబు

Tdp Chandra babu : విజన్‌ 2027 లక్ష్యంగా పనిచేయాలన్న చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 01:46 PM IST

గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శభాకాంక్షలు తెలిపారు.

గుంటూరులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు, అచ్చన్నాయుడు
గుంటూరులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు, అచ్చన్నాయుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్ తో ప్రభుత్వాలు పని చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలు హనుమయ్య కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు జెండా ఎగురవేశారు. విజన్ 2047, లక్ష్యాలపై 10 సూచనలు చేశారు. రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలని సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలని, ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని, .బలమైన యువశక్తి ఉన్న దేశమని, యువతకు అవకాశాలు కల్పించాలన్నారు.

దేశంలో సంపద సృష్టి జరగాలని, సంపదను పేద ప్రజలకు పంచాలని చంద్రబాబు సూచించారు. రైతుల కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకురావాలని, 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదన్నారు. విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలని, 7.మహిళా సాధికారత కు ప్రణాళికలు అమలు చెయ్యాలన్నారు. దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలన్నారు.

ఏపిలో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేసినట్లే కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలన్నారు. అవినీతి లేని పాలనను అందించాలి. టెక్నాలజీ ద్వారా అవినీతిని అంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలని అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం కావాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చెయ్యాలి.

IPL_Entry_Point

టాపిక్