ఇక జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు
ప్రభుత్వంపై దూకుడు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో ధరల పెరుగుదల, మద్యం విక్రయాలు, ఇసుక కొరత వంటి అంశాలపై నిరసన కార్యక్రమాల్లో బుధవారం నుంచి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.
ఏపీలో వేసవి ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా క్రమంగా పెరుగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోగా, చంద్రబాబు కూడా జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. 4వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు మొదలవుతున్నాయి. టీడీపీ ఇప్పటికే నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. మే 4న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజక వర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 5వ తేదీభీమిలీ నియోజక వర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడివరం నియోజక వర్గం కోరింగ గ్రామంలో నిర్వహించే బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రభుత్వ పన్నుపోటు, వివిధ రూపాల్లో ప్రజలపై మోపుతున్న భారానికి నిరసనగా పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. టీడీపీ ప్రారంభించిన నిరసన కార్యక్రమాల ఉధృతి పెంచేందుకు సీబీఎన్ స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మే చివర్లో నిర్వహించే మహానాడు వరకు చంద్రబాబు జిల్లా పర్యటనలు కొనసాగించనున్నారు. చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్