తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandi Sanjay Kumar | బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై తీవ్ర ఆగ్రహం

Bandi Sanjay Kumar | బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై తీవ్ర ఆగ్రహం

28 February 2024, 15:55 IST

  • కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో ప్రజాహిత యాత్రలో ఈ ఘటన జరిగింది. వంగరలో యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. ఈ దాడితో అసహనం చెంది బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దన్నారు. అయితే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసులే ఈ ప్రభుత్వం కూడా ఉన్నారని గుర్తు చేశారు.