Police Raids On Pubs: అర్ధరాత్రి పబ్బుల్లో తనిఖీలు.. డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై ఫోకస్
18 December 2023, 14:42 IST
- హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆదివారం పలు పబ్బుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సిటీ పోలీసులు..విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల కోసం పోలీసులు తొలిసారిగా స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో సుమారు 17 కుపైగా పబ్ లలో ఆకస్మిక సోదాలు చేశామని అన్నారు. పబ్ లో సోదాల సమయంలో ఎలాంటి డ్రగ్స్, అనుమానాస్పద వస్తువులు లభించలేదని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు.