తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy Temple | రేవంత్ రెడ్డికి గుడి కట్టనున్న అభిమానులు.. మార్చి 19న భూమి పూజ!

Revanth Reddy Temple | రేవంత్ రెడ్డికి గుడి కట్టనున్న అభిమానులు.. మార్చి 19న భూమి పూజ!

06 March 2024, 10:07 IST

  • తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి గుడి కట్టాలని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు వీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మార్చి 19 ఉదయం 9 గంటలకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఆ రోజున రెడ్డి సంఘం నాయకుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు రేవంత్ రెడ్డి అని సంఘం నాయకులు చెబుతున్నారు. భూమి పూజకు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు.