Medaram Hundis | హుండీల్లో దర్శనమిచ్చిన విదేశీ కరెన్సీ.. నకిలీ నోట్లతో కలకలం
01 March 2024, 9:59 IST
- ఆసియాలోనే అతి పెద్ద జాతరైన మేడారం ముగియటంతో, హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అయితే హుండీల్లో నకిలీ నోట్లు రావటంతో ఆలయ సిబ్బందిలో కలకలం ఏర్పడింది. హుండీల లెక్కింపు సందర్భంగా విదేశీ కరెన్సీ రావటంతో కొద్ది పాటి కలకలం ఏర్పడింది. అంతే కాకుండా గాంధీ ఫోటో స్థానంలో అంబేద్కర్ ఫోటో ఉన్న నకిలీ 100 రూపాయల నోట్లు ప్రత్యక్షం అయ్యాయి. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని నోట్ల వెనుక ప్రింట్ చేసి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లను ఆలయ సిబ్బంది భద్రంగా దాచారు.