తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dk Aruna: చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష

DK Aruna: చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష

22 August 2023, 16:51 IST

  • తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. లిక్కర్ కేసును దారి మళ్లించేందుకు, 33 శాతం మహిళ రిజర్వేషన్లు కావాలని కవిత దొంగ దీక్ష చేశారని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.