Bandla Ganesh | కేటీఆర్ చుట్టూ ఈగో ఉంటుంది.. రకుల్ పెళ్లిపై బండ్ల గణేష్ పరోక్ష విమర్శలు
27 February 2024, 14:32 IST
- తండ్రి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి KTR అని కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్ విమర్శించారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్.. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. నీతివంతమైన పాలన అందిస్తున్న ఈ ప్రభుత్వం మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఆరు కాదని, ఏడు గ్యారెంటీలు ఇచ్చిందని బండ్ల గణేష్ అన్నారు. స్వేచ్ఛ అనే గ్యారెంటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చామని చెప్పారు.